లక్ష్మేశ్వర ఒక వ్యవసాయ వ్యాపార పట్టణం. గడగ్ జిల్లాలో కలదు. ఈ పట్టణం మతపర అంశాలకు ప్రసిద్ధి. ఇక్కడ జైనమత అనుచరులేకాక శివ భక్తులు కూడా ఉంటారు. సోమేశ్వర దేవాలయంలో శివ భగవానుడి విగ్రహం కలదు. ఈ దేవాలయం సుందరమైన శిల్పాల కళ కలిగి ఉంటుంది. సన్నబాసడి మరయు శంకబసడి అనేవి రెండు ప్రసిద్ధ జైన మందిరాలు
ఒక దర్గా, జమ్మా మసీదు, ముఖ మసవన్న క్షేత్రం, కోడియల్లమ్మ దేవాలయం మరియు ఒక పెద్ద సూర్య నారాయణ విగ్రహం పట్టణంలో ప్రధాన ఆకర్షణలు. ఈ పట్టణం సంస్కృతికే కాక విద్యాపరంగా కూడా పురోగతి గాంచింది. గడగ్ వెళ్ళే వారు దీనిని తప్పక చూడాలి. దాని స్ధాపన నుండి పేర్లు అనేక మార్లు మారినాయి. దీని గత పేర్లు...పురిగెరె, పొరిగెరె, పురికనగర, పులికనగర్ మరియు పులిగీలుగా చెపుతారు.



Click it and Unblock the Notifications