గడగ్ జిల్లా నార్గుండ్ ప్రదేశంలో నార్గుండ్ కోట ప్రసిద్ధి గాంచింది. సర్కా 1675 లో ఛత్రపతి శివాజి నిర్మించిన రెండు కోటలలో ఇది ఒకటి. రెండవది రామదుర్గ కోట. 1691-92లో దీనిని ఔరంగజేబు స్వాధీనం చేసుకోగా 1706-07 లలో రామరావ్ దాదాజీ భావే తిరిగి పొందాడు. 1778 లో దీనిని మైసూరు పాలకుడు హైదర్ ఆలీ గెలిచాడు.
1784 లో టిప్పు సుల్తాన్ స్వాధీనం చేసుకున్నాడు. 1857లో అది బ్రిటీష్ పాలకుల వ్యతిరేక ఉద్యమాలకు నిలయం అయింది. ఈ ఉద్యమాలలో బాబా సాహెబ్ అంటే భాస్కర్ రావ్ భావే పాల్గొన్నారు.



Click it and Unblock the Notifications