సిద్దాపూర్ సహజ ప్రకృతి అందాలకు ప్రసిద్ధి. ఈ పట్టణం ఉత్తర కన్నడ జిల్లాలోని పశ్చిమ కనుమలలో మధ్య భాగాన కలదు. సముద్ర మట్టానికి సుమారు 1,850 అడుగుల ఎత్తునగల సిద్ధాపూర్ ఎంతో చల్లగాను ఆహ్లాదకరంగాను ఉంటుంది. ఈ ప్రాంతంలో ఎక్కువగా కాఫీ, యాలకులు, మిరియాలు, పైన్ ఆపిల్ తోటలు ఉంటాయి.
పచ్చని ఈ తోటలగుండా నడక సాగిస్తే అద్భుత పకృతి దృశ్యాలను చూసి ఆనందించవచ్చు. ఈ ప్రాంత పర్యటన మరువలేని అనుభూతులను కలిగిస్తుంది. ఈ పట్టణం గురించిన కొన్ని ప్రాధమిక అంశాలు ఈ పట్టణానికి బురుడే నీటి జలపాతాలు ఒక ప్రధాన ఆకర్షణ. ఈ ప్రాంతంలో దేవాలయాలు కూడా ఉన్నాయి. వాటిలో లక్ష్మీ నారాయణ దేవాలయం, కొండి మరికాంబ దేవాలయం, బంకేశ్వర దేవాలయం ప్రసిద్ధి చెందినవి. సిద్దాపూర్ కు సమీపంలో అద్భుత పకృతి దృశ్యాలను చూపగల మరికొన్నిఇతర గ్రామాలు కూడా ఉన్నాయి.
వీటన్నింటిలోనూ తోటలు అధికం. ప్రతి ఏటా ఇక్కడ హాకీ పండుగ వేడుకలు జరుగుతాయి. వీటిని కొడవ అంటారు. ఈ వేడుకలకు ఎంతోమంది ప్రజలు వస్తారు. ఇక్కడకల పొలిబెట్ట వద్ద ప్రసిద్ధి చెందిన బౌద్ధ దేవాలయం, ఒక కోట కూడా ఉంటాయి. వీటిని ఒకే మార్గంలో చూడవచ్చు. అతి చల్లగా ఉండే ప్రదేశం కనుక సిద్దాపూర్ సందర్శనకు వర్షాకాలం ముందర గల వేసవి నెలలు అనుకూలంగా ఉంటాయి. ఈ ప్రాంత సందర్శనకు అక్టోబర్ నుండి జనవరి వరకు కూడా బాగుంటుంది. బెంగుళూరు అంతర్జాతీయ విమానాశ్రయం, దేశంలోని ప్రధాన నగరాలవారికి మరియు అంతర్జాతీయ పర్యాటకులకు అనువుగా ఉంటుంది.
రైలు ప్రయాణం చేయాలనుకునేవారు, వివిధ ప్రాంతాలనుండి మైసూర్ రైలు స్టేషన్ చేరి అక్కడినుండి సిద్దాపూర్ కు టాక్సీలు, బస్ లు లేదా ఇతర వాహనాలలో కూడా చేరవచ్చు.