సోండా లేదా సోడి అనేది ఒక దేవాలయాల పట్టణం మరియు వాదిరాజ మఠం కలిగి ఉంటుంది. ఈ ప్రదేశం కర్నాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఉంది. సిర్సి పట్టణానికి దగ్గరగా ఉంది. సోండా సముద్ర మట్టానికి సుమారు 2000 మీటర్ల ఎత్తున ఉంది. 16వ శతాబ్దం నుండి 18వ శతాబ్దం వరకు పాలించిన స్వాది రాజుల పాలనలో ఒక ప్రధాన పట్టణంగా విలసిల్లేది. శ్రీ వాదిరాజ ఇక్కడ ఒక మఠాన్ని స్ధాపించారు. శ్రీ మధ్వాచార్యుల ద్వైత సిద్ధాంతానికి నాంది పలికారు.
పర్యాటకులు సోండా పట్టణాన్ని ఎందుకు దర్శిస్తారు? ఇక్కడి దేవాలయం శ్రీ మహా విష్ణువు అవతారంగా చెప్పే త్రివిక్రమ భగవానుడిది. త్రివిక్రమ దేవుడి విగ్రహం ఎంతో బాగుంటుంది. బయటి ప్రాంగణంలో రాతి రధం పండుగల సమయంలో రధోత్సవానికి ఉపయోగిస్తారు. ఈ రాతి రధం లోపల శ్రీ మహాలక్ష్మీ మరియు త్రివిక్రముడు ఉంటారు. దేవాలయానికి ఉత్తర దిక్కుగా మఠ ప్రవేశంలో రాజంగన ఉంటుంది. దీనిని చేరాలంటే 24 మెట్లు దిగాలి. ఈ ప్రదేశంలో వంటగది, స్టోర్స్, పూజా మందిరం ఉంటాయి.
సోండా గ్రామంలో ఒక పురాతన కోట ఉంటుంది. అనేక పురాతన, చిన్న చిన్న ఫిరంగులుంటాయి. ఇక్కడ వాదిరాజ మఠమే కాక, రెండు ఇతర మఠాలు కూడా ఉంటాయి. ఇవి అకలంగ మఠం మరియు స్వర్ణవల్లి మఠంగా చెపుతారు. ఇక్కడే ఒక జైన మందిరం కూడా ఉంది. దేవాలయంలో వెంకటరమణ స్వామి ఉంటారు. చారిత్రక మరియు మతపర ప్రాధాన్యతతో కూడిన దేవాలయాలు, మఠాల కారణంగా సోండా లేదా సోడి తప్పక చూడదగిన ప్రదేశం.