దట్టమైన పచ్చటి అడవులు, ఎత్తైన జలపాతాలు, పురాతన దేవాలయాలు అన్ని కలిపి ఉత్తర కర్నాటక జిల్లాలోని ఈ ప్రధాన వినోద ప్రదేశం సిర్సిని పర్యాటకులకు మరువలేని ఒక విహార స్ధలంగా చేస్తాయి. ఈ ప్రదేశం పడమటి కనుమల మద్య భాగంలో బెంగుళూరు నగరానికి సుమారు 407 కి. మీ. దూరంలో ఉంది.
సిర్సిలో చూడదగినవి ఏమిటి?
ప్రకృతి అందాలు తనివితీరా చూసి ఆనందించవచ్చు. సిర్సి వద్ద డోనిహల్లనుండి అఘనాషిని నది మొదలవుతుంది. ఈ నది సిర్సి కొండలపై ప్రవహించి అద్భుత జలపాతాలు జారవిడుస్తుంది. సిర్సి లో అధిక వర్షాలు అక్కడి అడవులను మరింత అందంగా తయారు చేస్తాయి. వీటిలో అనేక వన్యప్రాణులు నివసిస్తాయి. వీటన్నిటితో సిర్సి ప్రదేశం గొప్ప పర్యాటక స్ధలంగా పేరుపడింది.
ఇక్కడ ప్రసిధ్ధి చెందిన దేవాలయం అంటే 16వ శతాబ్దం నాటి మరికాంబ దేవాలయం. ఏటా జరిగే వేడుకలకు వేలాది భక్తులు వస్తారు. ఇక్కడ మహా గణపతి దేవాలయం ఉంది. భక్తులు తాము ఏ పని చేయాలన్నా ముందుగా వచ్చిఈ దేవాలయాన్ని దర్శించుకుంటారు. గణపతి ఆశీర్వాదం ఉంటే నిరాశ చెందవలసిన అవసరం లేదంటారు. వారు కోరిన కోరికలు తీరిన వెంటనే అనుకున్న మొక్కుబడులు చెల్లిస్తారు. ఈ ప్రదేశంలో మరో చూడదగ్గ ప్రాంతం బనవాసి, సహస్రలింగ మరియు ఊంఛల్లి జలపాతాలు. బనవసి పురాతన పట్టణం. ఒకప్పుడు కర్నాటక రాజధానిగా ఉండేది. సహస్రలింగలో వేలాది శివలింగాలు దట్టమైన అడవి మధ్య నదిలో ముణిగి ఉన్నాయి. సిర్సి చేరటం తేలికే. సమీప ఎయిర్ పోర్ట్ 100 కి.మీ.గా హుబ్లిలో ఉంది. రోడ్డు ప్రయాణం కూడా తేలిక.