నీటిలో మునిగిఉన్న శివలింగం, గంగోత్రి యొక్క పవిత్ర పర్యాటక ఆకర్షణ. ఈ సహజ శివలింగాన్ని, శీతాకాలంలో నీటి మట్టం తగ్గటంవలన, ఈ కాలంలో మాత్రమే చూడగలం. దీనిని జలమగ్న శివలింగం అని కూడా పిలుస్తారు. పురాణాల ప్రకారం, శివుడు ఈ ప్రదేశంలోనే గంగను తన శిఖలో బంధించాడని చెపుతారు.