బాబా రిషి ప్రదేశం ప్రసిద్ధి చెందిన ముస్లిం స్కాలర్ పేరు పై ఏర్పడింది ఇది గుల్మార్గ్ కు 5 కి.మి. ల దూరంలో సముద్ర మట్టానికి 2133 మీటర్ల ఎత్తున కలదు. బాబా 15 వ శతాబ్దినికి చెందిన కాశ్మీర్ రాజు జైనుల్లాబ్దీన్ కోర్ట్ లో సభ్యుడు గావుండేవాడు. 1480 సంవత్సరం లో ఆయన చనిపోయే వరకు రాజు కు విశ్వాసంగా సేవ చేసాడు. ఈ సమాధి నిర్మాణం మొఘల్ మరియు పర్షియన్ శైలిలో నిర్మించారు. ఈ మసీదు అందమైన తోటల మధ్య వుంది, పర్యాటకులను సంవత్సరంలో ఎపుడైనా సరే ఆకర్షిస్తుంది.
పర్యాటకులు ఈ ప్రదేశాన్ని అక్కడ లభ్యం గా వుండే పోనీలు , గుర్రాలు వంటి వాటిపై ప్రయాణించి చూడవచ్చు. ఈ ప్రదేశం ఉదయం 9 గం నుండి సా 5 గం. వరకు తెరచి వుంటుంది.



Click it and Unblock the Notifications