బానిబాల్ పాస్ కింది భాగం లో పీర్ పంజాల్ శ్రేణులలో సముద్ర మట్టానికి 1876 మీటర్ల ఎత్తులో వేరి నాగ కలదు. ఈ నీటి బుగ్గ పేరు నిలా నాగ అనే కాశ్యప రిషి పేరు కల అతని కుమారుడి పేరు పై పెట్టబడింది. ఈ ప్రదేశం లో నిర్మాణపు పనులను చక్రవర్తి షా జహాన్ మొదలు పెట్టారు. 1620 సంవత్సరం లో చక్రవర్తి జహంగీర్ పాలనలో ఈ నీటి బుగ్గ గుండ్రం గా వుండేది. దీనిని తర్వాత అష్ట భుజి ఆకారం లోకి మార్చారు. షా జహాన్ ఇక్కడ ఒక గార్డెన్, విశ్రాంతి భవనం నిర్మించారు. ఈ నిర్మాణాలకు వస్తువులను ప్రత్యేకంగా ఇరాన్ దేశం నుండి తెప్పించారు
నీటి బుగ్గ నీరు చాలా స్వచ్చంగా వేడిగా వుంటుంది. ఔషధ గుణాలు కలిగి వుంటుంది. 15 మీటర్ల లోతు 80 మీటర్ల వృత్తాకారం కల ఈ నీటి బుగ్గ చుట్టూ అందమైన చెట్లు, రంగు రంగుల పూవులు వుంటాయి. ఈ నీటి బుగ్గ జీలం నదికి ప్రధాన ఆధారం దీని సమీపంలో మొగలుల స్నానపు గదులు, మరి కొన్ని నిర్మాణాలు కనపడతాయి.



Click it and Unblock the Notifications