ఇన్స్టిట్యూట్ ఆఫ్ మ్యురాల్ పెయింటింగ్ ఒక అద్భుత ప్రదేశం. దీనిని 1989 లో నిపుణుడైన శ్రీ మామ్మియూర్ క్రిషనం కుట్టి స్థాపించారు. ఈ సంస్థను గురువాయుర్ దేవస్వోం నిర్వహిస్తోంది. ఇది గురువాయుర్ దేవాలయ సమీపంలో కలదు. కుడ్య చిత్రాలలో ఈ సంస్థ శిక్షణను ఇస్తుంది. సంప్రదాయక విధానాలను గురుకులం పద్ధతిలో బోధిస్తుంది. కేరళ సంస్కృతికి సంబంధించి వివిధ సెమినార్లు, ప్రదర్శనలు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఆసక్తి కలవారు దేశ విదేశాలనుండి వచ్చి ఇక్కడ శిక్షణ పొందుతూంటారు.