మమ్మియూర్ మహాదేవ దేవాలయం గురుబాయూరప్పన్ దేవాలయానికి సమీపంలో కలదు. పేరుకి తగినట్లు ఈ దేవాలయం శివుడిది. ఈ దేవాలయం అందమైన కుడ్య చిత్రాలచే అలంకరించబడి ఉంటుంది. విష్ణువును మోహిని అవతారంలో చిత్రించారు. ఈ దేవాలయం చూడకపోతే, గురువాయూర్ సందర్శన అసంపూర్తిగా చెపుతారు. కనుక ఈ దేవాలయానికి భక్తులు తప్పక వస్తారు. స్ధానికుల మేరకు గురువాయూర్ దేవాలయ ప్రదేశాన్ని క్రిష్ణుడికి ఇచ్చిన తర్వాత శివుడు ఇక్కడ కూర్చున్నాడని చెపుతారు. ఈ శివాలయ లోపలి భాగంలో, పార్వతి విగ్రహం కూడా కలదు. గణపతి, సుబ్రమణ్య, అయ్యప్ప, విష్ణు వులను కూడా ఈ దేవాలయంలో దర్శించవచ్చు.