మణిపూర్ స్టేట్ మ్యూజియంను మణిపూర్ సంపన్న సంస్కృతి మరియు వారసత్వాన్ని సంరక్షించేందుకు స్థాపించబడింది. 1969 లో భారతదేశం యొక్క మాజీ ప్రధాన మంత్రి దివంగత ఇందిరా గాంధీ ప్రారంభించారు. మణిపూర్ స్టేట్ మ్యూజియంలో పురావస్తు,మానవజాతి శాస్త్రం, సహజ చరిత్ర,జల్లన్ మరియు చిత్రలేఖనం మీద సమాచారాన్ని ఉంచటానికి స్టోరేజ్ గృహాలను నిర్మించింది.
దీనికి దగ్గరగా కాంగ్లా లో పోలో మైదానం ఉన్నది. పర్యాటకులు సులువుగా ఒకే రోజులో ఈ ప్రదేశాలను సందర్శించటానికి ప్లాన్ చేసుకోవచ్చు. మ్యూజియంలో ఉన్న ప్రముఖ కళాఖండాలలో ఒకటైన హియంగ్ హిరెన్ (రాయల్ బోట్) అనే 78 అడుగుల పొడవు గల పడవ ఓపెన్ గ్యాలరీలో ప్రదర్శించబడినది. మ్యూజియంలో అనేక గ్యాలరీలు, వివిధ అంశాలపై సమాచారాన్ని అందించేందుకు సౌకర్యము ఉన్నది.
మణిపూర్ స్టేట్ మ్యూజియం క్రమం తప్పకుండా కార్యకలాపాలు మరియు సంస్కృతి, జీవశాస్త్రం మరియు మ్యూజియం చేతనా కార్యక్రమాలను నిర్వహిస్తుంది. మొబైల్ ప్రదర్శనలు మరియు సైన్స్ ప్రదర్శనలు కూడా రాష్ట్ర మ్యూజియం వారు నిర్వహిస్తున్నారు. మ్యూజియం ఉదయం10 గంటల నుండి సాయంత్రం 4:30 గంటల వరకు తెరిచి ఉంటుంది.సెలవు రోజులలో మినహా సోమవారం నుండి శనివారం వరకు తెరిచి ఉంటుంది.



Click it and Unblock the Notifications