చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రముఖమైన పర్యాటక ఆకర్షణ ఇది. రాణి దుర్గావతి తన సేవలు జబల్పూర్ మరియు ఆ చుట్టు పక్కల ప్రాంతాలకి అందించినందుకు ఆమె స్మృత్యర్ధం 1964 లో ఈ మ్యూజియం నిర్మించబడింది. రాచరికపు జీవన విధానం గురించి వారి విలాసాల గురించి పర్యాటకులకి ఈ మ్యూజియం ద్వారా తెలుస్తుంది. రాణి యొక్క జీవితాన్ని, వివిధ సమయాలలో ఆమె పాలనని ఈ మ్యూజియం తెలుపుతుంది.
నాణేలు, శిల్పాలు, టెర్రకోట , చిత్రలేఖనాలు, ఇంట్లో ఉంచే కళాకృతులు, యుద్ద సామానులు, ఆయుధాలు, పుస్తకాలు మరియు డాక్యుమెంట్లు ఈ మ్యూజియాన్ని సందర్శించిన వారికి మరపు రాణి అనుభూతిని కలిగిస్తాయి. ప్రత్యేకించి ఈ మ్యూజియం చరిత్రని తెలుసుకోవాలనే ఔత్సాహికులకు ఆనందం కలిగిస్తుంది. రాణి దుర్గావతి మెమోరియల్ మ్యూజియం చరిత్రలో కి ఒకసారి ప్రయాణం చేసిన అనుభూతిని కలిగిస్తుంది. తప్పక సందర్శించవలసిన ప్రాంతం.



Click it and Unblock the Notifications