తిరువాణికులం మహదేవ దేవాలయం ఎర్నాకుళం జిల్లాలో అలూవాకు దక్షిణంగా, కలాడీ సమీపంలో కలదు. ఇక్కడ శివుడు ప్రధాన దైవం. ఇక్కడే శివుడి భార్య మాత పార్వతి కి గూడా ఒక గుడి కలదు. ఈ దేవాలయంలో గణేశ, అయ్యప్ప, విష్ణు విగ్రహాలు కూడా కలవు. ఈ గర్భగుడి సంవత్సరంలో 12 రోజులు మాత్రమే తెరచి ఉంచుతారు.
దీనిని పార్వతి శ్రీకోలి అంటారు. తిరువత్తిర పండుగ మరియు దేవాలయం తెరచినపుడు పూజలు నిర్వహించేందుకు భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. ఈ పన్నెండు రోజులను భక్తులు ఎంతో పవిత్రంగా భావిస్తారు.