మేళా కాసాకుడి, కారైకాల్ జిల్లాలో అత్యంత ప్రజాదరణ పొందిన గ్రామాలలో ఇది ఒకటి మరియు ఇది కారైకాల్ పట్టణం నుండి 7 కిలోమీటర్ల దూరంలో కారైకాల్-నేదున్గాడురోడ్ మీద ఉన్నది. ఇది 12వ శతాబ్దం లో నిర్మించబడిన వరదరాజ పెరుమాళ్ ఆలయానికి ప్రసిద్ధి చెందింది. ఇది రాష్ట్ర అధికారికంగా రక్షింపబడుతున్న ఒక ప్రాచీన స్మారకస్థూపం మరియు ఈ ఆలయం యొక్క బాహ్య మరియు అంతర్గత శిల్పకళ, రాతి చెక్కుళ్ళు పర్యాటకులకు ప్రముఖమైన ఆకర్షణగా నిలిచి ఉన్నది.
మీరు ఈ గ్రామంలోని శ్రీ నాగనాథ స్వామి దేవాలయాన్ని కూడా దర్శించవొచ్చు. మేళా కాసాకుడి, తిరువతిరై, వైకుండ ఏకాదశి, మాసి మంగం పండుగలు మరియు చితిరై పౌర్ణిమ వేడుకల సమయంలో ప్రధానంగా పర్యాటకులకు ఆకర్షణగా ఉన్నది. ఈ ప్రదేశం మతపరమైన మరియు నిర్మాణ ప్రాముఖ్యత కారణంగా, యాత్రికులు మరియు పర్యాటకులకు ఆకర్షణగా ఉంది.