భీమ్ కుండ్ విహారానికి వెళ్ళడానికి చాలా అందమైన ప్రదేశం. కియోంఝర్ జిల్లా కేంద్రం నుంచి ఇది 100 కిలోమీటర్ల దూరంలో వుంటుంది. ఈ ప్రాంతం వైతరణి నది మీద వున్న సహజ సిద్ధ జలాశయానికి సుప్రసిద్ధం అయింది. ఈ జలాశయం పేరుకు సంబంధించి ఒక కథ వుంది. పాండవులలో రెండో వాడు భీముడు ఇక్కడ స్నానం చేసాడు కనుక ఆ పేరు వచ్చిందని స్థానికులు చెప్తారు.
ఈ జలపాతం రెండు అంతస్తుల్లో వుంటుంది. ఈ ప్రాంతం లో ఒక దాని పైన మరో జలపాతం వుండడం వల్ల ఈ పేరు వచ్చిందని చాలా మంది విశ్వసిస్తారు. ఈ ప్రాంతానికి చాలా చారిత్రిక ప్రాధాన్యం కూడా వుంది. ఈ జలాశయం కియోంఝర్, మయూరభంజ్ అనే రెండు జిల్లాల సరిహద్దుల మీద వుంది – శీతాకాలంలో ఇక్కడ సమయం గడపడానికి చాలా బాగుంటుంది. ఫోటోగ్రఫీని ప్రేమించే వారు ఇక్కడికి వచ్చి వాళ్ళ అభిలాష నెరవేర్చే దృశ్యాలను అన్వేషిస్తారు.