ప్రసిద్ది చెందిన హిల్ మ్యూజియంలో పరిషత్ తంపురం మ్యూజియం కూడా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా విలక్షణమైన కళల ప్రదర్శన వల్ల ఈ మ్యుజియం ప్రాచుర్యం పొందింది. మొఘల్ ఆయిల్ పెయింటింగ్స్, ప్రాచిన శిల్పకళ లు వంటివి ఈ మ్యూజియంలో చోటు చేసుకున్న కొన్ని అద్భుతాలు. ఎన్నో పురాతన నాణేల సేకరణ ని కూడా మనం గమనించవచ్చు.
యువతరాలు ఒక్కసారి ఈ మ్యూజియం ని సందర్శించడం వల్ల రాష్ట్ర చరిత్ర మరియు సంస్కృతి గురించి తెలుసుకునేందుకు తోడ్పడుతుంది. ప్రాచీన కళాత్మక ప్రతిభా ప్రదర్శనల ద్వారా పురాతన కాలం వారి అభిరుచులు గురించి మనకొక అవగాహన లభిస్తుంది. ప్రాచీన కాలం లోకి వెళ్ళిన అనుభూతి ఈ మ్యుజియం ని సందర్శించడం ద్వారా మీకు కలుగుతుంది.
మన దేశానికి సంబందించిన అత్యుత్తమ సాంస్కృతిక చరిత్ర గురించి ఈ మ్యుజియం నుండి లభించే సమాచారాన్ని సేకరించడానికి ఎంతో మంది పురాతత్వ శాస్త్రవేత్తలు మరియు విద్యార్ధులు ఇక్కడికి తరలి వస్తారు. రోజులో కొన్ని గంటలు మాత్రమే ఈ మ్యూజియం తెరచి ఉంటుంది. ఈ మ్యూజియం ని సందర్శించడానికి ఒకసారి టైమింగ్స్ చూసుకుని వెళ్ళడం మంచిది.