ఈ ప్రాంత పర్యాటకులు నగర కోటను తప్పక చూడాలి దీనినే బిడనూర్ కోట అని కూడా అంటారు. ఈ కోట కొడచాద్రి పర్వతాలనుండి సుమారు 25 కి.మీ.ల దూరంలో ఉంటుంది. ఈ కోటను కేలాడి వంశస్ధులు 18వ శతాబ్దంలో నిర్మించారు. ఈ కోటలో కొన్ని భాగాలు శిధిలావస్ధలో ఉండగా మరి కొన్ని భాగాలను ఎర్రటి ఇటుకలతో పునర్నిర్మించారు. షరావతి నదిపై నిర్మించిన లింగనమక్కి డ్యామ్ వెనుక నీరు, దట్టమైన అటవీ ప్రదేశాన్ని ఏర్పరచటంతో కోట చుట్టు పక్కల ప్రదేశాలు ఎంతో అందంగా విస్తరించాయి. పర్యాటకులు ఇక్కడ శివప్ప నాయకుని ‘దర్బార్ హాల్ ’ దర్శించవచ్చు.
శత్రువుల దండయాత్రలనుండి తప్పించుకొనేటందుకు గాను ఒక పొడి బావి, చిన్నపాటి గుహలను కూడా ఈ రాజులు నిర్మించుకున్నారు. వాటిని కూడా చూడవచ్చు. కోట ఎత్తు ప్రదేశంలో నిర్మించటంతో, అక్కడి పడమటి కనుమల ప్రదేశాలు ఎంతో సుందరంగా కనపడతాయి.