విష్ణు మూర్తి దేముడుగా గల సారంగపాణి టెంపుల్ తమిళ్ నాడు లోని తంజావూర్ జిల్లాలో కలదు. కుంబకోణం రైలు స్టేషన్ నుండి ఒకటిన్నర మైళ్ళ దూరంలో వుంటుంది. ఈ టెంపుల్ ను 108 దివ్య దేశం లలో భాగంగా నిర్మించారు. ఈ టెంపుల్ గురించి ఆళ్వార్లు అనేక కీర్తనలు రాశారు. ఈ టెంపుల్ దక్షిణ ఇండియాలో మహా విష్ణువుకు చెందిన దేవాలయాలలో చాలా ప్రాచీనమైనది.
సారంగపాణి టెంపుల్ చాలా ప్రసిద్ధి చెందినది. టెంపుల్ గోపురం సుమారు 148 అడుగుల ఎత్తులో వుంటుంది. టెంపుల్ లో శ్రీ మహా విష్ణువు విగ్రహం అనంత శయన భంగిమ లో ఒక రధంలో ఆది శేషుడు పైన పడుకొని వుంటుంది. మాత కోమలవల్లి ని కూడా టెంపుల్ లో పూజిస్తారు.