పట్టేస్వరం దుర్గ టెంపుల్ కుంబకోణం కు 10 కి.మీ.ల దూరంలో కల పట్టేస్వరంలో కలదు. ఈ టెంపుల్ లో దుర్గ మాత విగ్రహం కలదు. ప్రతి సంవత్సరం వేలాది భక్తులు ఈ టెంపుల్ దర్శించి, దుర్గ మాత ఆశీస్సులు పొందుతారు. ఈ టెంపుల్ లో రాముడు ప్రతిష్టించిన శివలింగం కలదు. శ్రీరాముడు తాను రావణుడిని చంపినందుకు గాను పాప పరిహార్ధం ఇక్కడ శివుడిని ఆరాధించాడు.
ఈ టెంపుల్ చాలా పెద్దది. ఎత్తైన అయిదు గోపురాలు వుంటాయి. గత శతాబ్దంలో దీనిని అనేక మార్లు పునరుద్ధరించారు. దీని శిల్పశైలి చోళ, పల్లవ, నాయకల కాలం నాటిది.