కైజర్ బాగ్ పాలస్ ను అవద్ నవాబ్ వజీద్ అలీ షా 1847 లో నిర్మించాడు. ఈ నిర్మాణాన్ని అతను ప్రపంచం లో ఎనిమిదవ వింతగా చేయాలని కలలు కన్నాడు. చట్టార్ మంజిల్ కు తూర్పున కల ఈ నిర్మాణం, తారావళి కోతి, రోషన్ ఉద్ దౌలా కోతి, చులఖి కోతి లకు సమీపంలో వుంటుంది. తిరుగుబాటు చేసే నవాబులకు ఈ భవనం నిలయమై నాదని భావించిన బ్రిటిష్ ప్రభుత్వం దీనిని చాలా భాగం పడగొట్టింది.
ఈ పాలస్ లో అందమైన స్తంభాలు, హిందూ గొడుగులు, లాంతర్లు, మూరిష్ మినారెట్ లు వంటివి ఎన్నో కలవు. నిర్మాణం మొఘల్ మరియు యురోపెయన్ స్టైల్ ల మిశ్రమంగా వుంటుంది. ఆ నాటి సాంప్రదాయంగా దీనిలో మహిళలకు వేరుగా చాంబర్ లు నిర్మించారు. పాలస్ మధ్య భాగంలో పన్నెండు ద్వారాలతో అందమైన ఒక భవనం వుంటుంది.