నెహ్రు గులాబీ తోట, 1967 లో లుధియానా నడిబొడ్డున స్థాపించబడింది. ఆసియాలోనే అతిపెద్దదైన ఈ గులాబీ తోట 27 ఎకరాలకు పైగా విస్తరించి ఉంది. ఈ గులాబీ తోట షుమారు 1600 రకాల గులాబుల 17000 చెట్లను ప్రదర్శిస్తుంది. ఈ ప్రదేశంలో నిర్వహించే వార్షిక గులాబీ పండుగకు దూరం, సమీపం నుండి వేలసంఖ్యలో సందర్శకులు వస్తారు. అంతేకాకుండా ఈ నగరం ఈ తోట మొత్తం అందాన్ని ద్విగుణీకృతం చేసే విచిత్ర ఫౌంటైన్ ను కలిగిఉంది. ఇది ప్రత్యేకంగా కుటుంబంతో గడపడానికి, నడకకు ఆదర్శవంతమైన ప్రదేశం.