సుల్తాన్ బేటరీ మంగుళూరుకు 4 కి.మీ. దూరంలోని బేలూర్ లో ఉంది. ఇక్కడ సహజ అందాలనడుమ కల ఒక వాచ్ టవర్ లేదా పరిశీలనాస్తంభం ప్రధానమైనది. దీనిని టిప్పు సుల్తాన్ నిర్మించాడు. అ టవర్ ను టిప్పు సుల్తాన్ తన మరణానికి 15 సంవత్సరాలకు ముందు అంటే క్రీ.పూ.1784 లో నిర్మించాడు. ఈ ప్రదేశానన్ని గతంలో సుల్తాన్ బేటరీ అనేవారు. బేటరీ అంటే ఫిరంగుల కాల్పు అనే అర్ధం ఉండేది. నల్లటి రాతితోఈ ప్రదేశం యుద్ధ ఓడలు నదిలోకి రాకుండా కట్టబడింది. దీనిని ఇంగ్లీష్ వారు వశం చేసుకోగా వారినుండి టిప్పు సుల్తాన్ గెలుచుకున్నాడు. ఈ ప్రదేశంలో వాచ్ టవర్ మాత్రమేకాదు, అనేక ఫిరంగులు పెట్టబడిన ఒక పెద్ద కోటగా ఉంటుంది. ఈ టవర్ క్రింద ఒక స్టోరేజ్ స్ధలం ఉంది. దీనిలో గన్ పౌడర్ నిలువ చేస్తారు. గతంలోని పాలకులు ఈ ఓడరేవు సంరక్షణకు అనేక పేలుడు పదార్ధాలతో ఏ రకమైన జాగ్రత్తలు తీసుకున్నారనేది ఈ ప్రదేశం తెలుపుతుంది. ఈ ప్రదేశంలో తన నావికా బలంతో పాలకులు, విదేశీయుల ఓడలను ఎదిరించి పోరాడేవారు. ఈ వాచ్ టవర్ పైకి ఎక్కి చూస్తే అరేబియా మహా సముద్రం ఎంతో రమణీయంగా గోచరిస్తుంది. ఆనందంతో పరవశించిపోతారు. ఈ ప్రదేశం సహజంగాను, మనుష్య నిర్మాణాలతోను కలసి ఉండి రమణీయంగా ఉంటుంది. ఒకప్పుడు ఈ ప్రదేశం ప్రాధాన్యతలో వెనుకబడినప్పటికి నేడు పర్యాటకులు దీనిని ఎంతో అభిమానిస్తూ దర్శిస్తున్నారు.