పశ్చిమ కనుమలను సహ్యాద్రి శ్రేణులు అని కూడా అంటారు. ఇవి భారతదేశ పడమటి భాగమంతా వ్యాపించాయి. ఈ శ్రేణులు సుమారుగా దేశంలోని 5 రాష్ట్రాలలోకి వ్యాపించి ఉన్నాయి. గుజరాత్ లో మైదలైన ఈ పర్వత శ్రేణులు, మహారాష్ట్ర, గోవా, కర్నాటక, కేరళ లో వ్యాపించి తమిళ నాడులోని కన్యాకుమారి లో అంతమవుతాయి. ఇవి షుమారు 1600 కి.మీ. పొడవున ఉంటాయి. ఘాట్ కొండలు నుండి నదులు ప్రవహిస్తూ సుమారు 40 శాతం నీటిని అందిస్తాయి. ఎన్నో రకాల మొక్కలు, జీవులు షుమారుగా 325 రకాల జాతులు కనపడతాయి. పడమటి కనుమలు సగటు ఎత్తు షుమారు 1200 మీ. గా ఉంటుంది. భౌగోళికంగా చూస్తే పడమటి కనుమలు పర్వత శ్రేణులు కావు అవి దక్కన్ భూమి కి అంచులుగా ఉంటాయి. పడమటి కనుమలలో మానవ నిర్మిత రిజర్వాయర్లు, సరస్సులు అనేకం ఉన్నాయి. నీలగిరి కొండలపై ఊటీ సరస్సు, పళనికొండలపై కొడైకెనాల్ సరస్సు ప్రఖ్యాతి గాంచిన సరస్సులు. పడమటి కనుమలనుండి నిరంతరం ప్రవహించే గోదావరి, క్రిష్ణ, కావేరి నదులు పుట్టాయి చివరకు ఇవి బంగాళా ఖాతంలో తూర్పు దిశగా చేరిపోతున్నాయి.
వర్షాకాలంలో అనేక ప్రవాహాలు, నదులు ఈ కనుమలనుండి ప్రవహించి దేశంలోనే అతి ప్రధానమైన కర్నాటకలోని జోగ్ ఫాల్స్ వంటివి కూడా ఏర్పడ్డాయి. పడమటి కనుమలు పడమటి వైపు పవనాలు వ్యాపించకుండా అడ్డుకుంటాయి. ఈ ప్రాంతపు అటవీ ప్రాంతాన్ని సంరక్షిస్తాయి. హిమాలయాలు మన దేశానికిఎంత ప్రధానమో పడమటి కనుమలు కూడా మన దేశ పర్యావరణాన్ని రక్షించేందుకు అంత ప్రధానంగా చెపుతారు. దేశంలోని వాతవరణం యావత్తూ ఈ రెండు పర్వత శ్రేణులచే సమతుల్యం చేయబడుతోంది.