Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు» మంత్రాలయం

మంత్రాలయం -దక్షిణ బృందావనం

13

మంత్రాలయం దక్షిణ భారత దేశ  రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్   లోని కర్నూల్ జిల్లా లో ఉంది. ఈ పట్టణం తుంగభద్ర నదీ తీరంలో ఉంది. కర్ణాటక రాష్ట్రం తో సరిహద్దు పంచుకుంటుంది. ఈ పట్టణం మంచాలే అనే పేరు తో ప్రసిద్ధికెక్కింది.గురు రాఘవేంద్ర స్వామి నిర్మించిన బృందావనం వల్ల తెలుగు వారిలో ఇది బాగా ప్రాచుర్యం పొందింది. శ్రీ మధ్వాచార్యులుని నాయకునిగా పరిగణించే మధ్వ సన్యాసుల శాఖ ను అనుసరించిన పవిత్ర వ్యక్తి గురూజీ.

స్థానికుల నమ్మిక ప్రకారం, గురు రాఘవేంద్ర స్వామి దక్షిణ బృందావనం లో గత 339 సంవత్సరాలుగా నివసిస్తున్నారు. మరో 361 సంవత్సరాలు ఇక్కడే నివసిస్తారు. గురూజీ బృందావనం లో అడుగుపెట్టినప్పుడే ఆ ప్రదేశాన్ని 700 సంవత్సరాల పాటు తన ఆవాసం గా స్వీకరిస్తానని ప్రకటించారు. ఈ కారణం చేత దేశం లోని హిందువులచే ఇది పవిత్ర పట్టణం గా పరిగణించబడుతుంది.

మంత్రాలయం లోని ఆసక్తికరమైన ప్రదేశాల్లో శ్రీ గురు రాఘవేంద్ర స్వామి ఆలయం, బిక్షాలయ గుడి, పంచముఖి ఆంజనేయ ఆలయం ఉన్నాయి. ఈ పట్టణం లో విమానాశ్రయం లేదు, అయితే ఇక్కడికి రహదారి గుండా లేక రైలు మార్గంలోనూ సునాయాసంగా చేరుకోవచ్చు. పట్టణం యొక్క కేంద్ర ప్రదేశం నుంచి రైల్వే స్టేషన్ సుమారు 16 కి.మీల దూరంలో ఉంది. మంత్రాలయం చేరుకోవటానికి ఎన్నో ప్రభుత్వ మరియు ప్రైవేటు బస్సులు ఉన్నాయి. ఈ  ప్రదేశంలో  ఉష్ణ మండల వాతావరణం నెలకొని ఉంది. వేసవులు చాలా వేడిగా, పొడిగా, శీతాకాలాలు కాస్త చల్లగా ఉంటాయి.

మంత్రాలయం ఇది దేనికి ప్రసిద్ధి చెందినదో తెలుసా

మంత్రాలయం వాతావరణం

సందర్శించేందుకు ఉత్తమ సమయం మంత్రాలయం

  • Jan
  • Feb
  • Mar
  • Apr
  • May
  • Jun
  • July
  • Aug
  • Sep
  • Oct
  • Nov
  • Dec

ఎలా చేరాలి? మంత్రాలయం

  • రోడ్డు ప్రయాణం
    రోడ్డు మార్గం: మంత్రాలయం పొరుగు నగరాల , పట్టణాల తో మంచి రహదారుల ద్వారా అనుసంధానించబడింది. రాష్ట్రం లోని వివిధ భాగాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో బస్సులు నడుపుతున్నది. ఈ ప్రాంతానికి ఉన్న ధార్మిక ప్రాముఖ్యత వల్ల కర్ణాటక మరియు తమిళనాడు లాంటి ఎన్నో రాష్ట్రాలు మంత్రాలయానికి బస్సులు నడుపుతున్నాయి.
    మార్గాలను శోధించండి
  • రైలు ప్రయాణం
    రైలు మార్గం: ఈ పట్టణం లో మంత్రాలయం రోడ్డు రైల్వే స్టేషన్ ఉంది. ప్రధాన పట్టణం నుంచి ఇది సుమారు 16 కి.మీ ల దూరంలో ఉంటుంది. భారత దేశంలోని ఇతర ప్రాంతాలకు ఈ రైల్వే స్టేషన్ బాగానే అనుసంధానించబడింది. ఇది చెన్నై, కోల్ కతా, బెంగుళూరు, ఢిల్లీ వెళ్ళే రైళ్ళ దారి లోనే ఉంది. రైల్వే స్టేషన్ నుంచి బస్సు లేదా టాక్సీ లేదా ఆటో తీసుకుని పట్టణం చేరుకోవచ్చు.
    మార్గాలను శోధించండి
  • విమాన ప్రయాణం
    విమాన మార్గం: మంత్రాలయం లో విమానాశ్రయం లేదు. అతి సమీపంలో ఉన్న విమానాశ్రయం హైదరాబాద్ లోని శంషాబాద్ లో ఉన్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. హైదరాబాద్ విమానాశ్రయానికి భారత దేశంలోని మరియు ప్రపంచంలోని ఇతర నగరాల నుంచి విమానాలు ఉన్నాయి. విమానాశ్రయం నుంచి మంత్రాలయానికి మీరు టాక్సీ తీసుకుంటే సుమారు 4000 రూపాయలు ఖర్చు అవుతుంది.
    మార్గాలను శోధించండి
One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
09 Jun,Tue
Return On
10 Jun,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
09 Jun,Tue
Check Out
10 Jun,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
09 Jun,Tue
Return On
10 Jun,Wed

Near by City