పర్యాటకులు వరాహి నదిపై ఉన్న సిద్ధి వినాయక దేవాలయం కూడా చూడవచ్చు. హత్తియంగాడి అనేది చిన్న గ్రామం మరావంతే టవున్ కు షుమారు 14.3 కి.మీ.ల దూరంలో ఉంది. ప్రతిరోజు ఇక్కడ యాత్రికులకు అన్నదానం జరుగుతుంది. ఈ ప్రాంతంలోని హిందువులకు ఇది ఎంతో ప్రధాన స్ధలంగా ఉంటుంది. ఈ దేవాలయాన్ని 8వ శతాబ్దంలో అలుప రాజులు నిర్మించారు. గణేషుడికి అంకితమిచ్చారు. ఆయనను ఇక్కడ సిద్ధి వినాయక అంటారు. ఈ విగ్రహం సాలిగ్రామ రాతితో చెక్కబడింది. 2.5 అడుగుల మూర్తి ఎన్నో ఆభరణాలతో ఉంటుంది. విగ్రహ తొండం ఎడమవైపుకు ఉంటుంది. ఈ విగ్రహం బాలగణేషుడు నిలబడి ఒక చేతితో కుడుముల గిన్నె పట్టుకున్నట్లు ఉంటాడు. ఈ విగ్రహం ప్రతి సంవత్సరం పెరుగుతున్నట్లుగా కూడా కొంతమంది చెపుతారు. గతంలో ఈ విగ్రహానికి తయారు చేసిన వెండి తొడుగు ప్రస్తుతం ఈ విగ్రహానికి సరిపోవటం లేదని విగ్రహం పెరుగుతోందని చెపుతారు.