పడమటి కనుమలలోని ఎరవికులం నేషనల్ పార్క్ సుమారు 97 చ. కి.మీ.ల విస్తీర్ణం కలిగి ఉంది. మున్నార్ కు సమీపంలో కలదు. ఈ ప్రాంతం అత్యధిక జీవ వైవిధ్యం కల ప్రాంతంగా గుర్తించబడింది. ప్రస్తుతం ఈ పార్క్ అటవీ మరియు వన్య జీవుల సంరక్షణ శాఖ అధీనంలో నిర్వహించబడుతోంది. నీలగిరి ధార్ లకు ఈ ప్రాంతం ప్రసిద్ధి అయినప్పటికి వివిధ రకాల జంతువులను కూడా చూడవచ్చు. పక్కనే కల చిన్నార్ మరియు ఇందిరా గాంధీ వన్య సంరక్షణాలయాలతో కలిపిన ఈ నేషనల్ పార్క్ పడమటి కనుమలలో అతి పెద్ద సంరక్షిత ప్రాంతంగా చెప్పవచ్చు. అంతేకాక, ఈ పార్క్ ఇక్కడి నదులకు కేచ్మెంట్ ప్రదేశంగా కూడా ఉంటుంది. ఎరవికులం నేషనల్ పార్క్ మూడు జోన్లుగా విభజించారు. ప్రధాన, బఫర్ మరియు టూరిజం ప్రాంతాలుగా చేశారు. పర్యాటకులను టూరిస్టు ప్రాంతాలకు అంటే రాజమల వంటి వాటికే అనుమతినిస్తారు. ఈ నేషనల్ పార్క్ లో 26 జాతుల మమ్మల్స్ మరియు 132 జాతుల పక్షులు కలవు. జంతువుల సంతానోత్పత్తి సమయం జనవరి, ఫిబ్రవరి నెలలలో ను మరియు వర్షరుతువులోను పార్కుప్రవేశానికి అనుమతినివ్వరు.