మహునాగ్ ఆలయం, నల్దేరా గోల్ఫ్ కోర్సు మధ్యలో, సముద్ర మట్టానికి 1830 మీటర్ల ఎగువన ఉంది. ఈ ఆలయం మహునాగ్ గా కూడా పిలిచే సూర్యదేవుని కుమారుడు కర్ణునికి చెందింది. ఈ ఆలయ దైవం చట్టపరమైన, కుటుంబ సమస్యల పరిష్కారంలో సహాయ పడతాడని స్థానికుల విశ్వాస౦.
ఈ ఆలయం పహాడి శైలిలో నిర్మించారు; భారతదేశ ఉత్తర దిశగా హిమాలయ పర్వతాల వెంట నివసిస్తున్న ప్రజా సమూహాలను సాధారణంగా పహాడి లు అని వ్యవహరిస్తారు. చారిత్రిక కధనాల ప్రకారం ఈ ఆలయాన్ని శ్యాం సేన్ మహారాజు 1664 లో నిర్మించాడు. ఇతను కర్ణునికి గొప్ప భక్తుడు. ప్రతి ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. ప్రతి ఏటా మకర సంక్రాంతి పండుగనాడు ఇక్కడ జరిగే ఉత్సవం కూడా భారి సంఖ్యలో ప్రజాలను ఆకర్షిస్తుంది. ఈ ఆలయం నుండి కర్సోగ్ లోయను, హిమాలయాలను కూడా స్పష్టంగా చూడవచ్చు.