నల్గొండ లోని లతీఫ్ షేబ్ దర్గా, ఈ ప్రాంత౦లొ ఉన్న మత సామరస్యానికి ఉత్తమ ఉదాహరణ. ఈ దర్గా ముస్లి౦ సన్యాసికి చెందినప్పటికీ అన్ని మతాల ప్రజలు పెద్ద సంఖ్యలో ఇక్కడకు విచ్చేస్తారు. ఈ ప్రాంతం పర్వతరోహకులకు ప్రియమైన రెండు రెండు కొండల పైన ఉంది. అందుకని, సన్యాసి ఆశీస్సుల కోసం వచ్చే వారితో బాటుగా అనేక మంది పర్యాటకులను కూడా ఈ దర్గా వద్ద గమనించవచ్చు.
ఈ దర్గా వద్ద ప్రార్ధన చేస్తే కోరికలు ఫలిస్తాయని విశ్వసిస్తారు. కనుక, ఈ దర్గాలో ప్రార్ధించి, ఈ సన్యాసి ఆశీస్సులు పొందడానికి దగ్గర దూర ప్రాంతాల నుండి ప్రజలు వస్తారు. ఈ దర్గాలో ప్రతి ఏట ఉరుసు అనే ఉత్సవం జరుగుతుంది. ఎంతో ప్రసిద్ది చెందిన ఈ ఉత్సవానికి ఆ రోజున లక్షల మంది భక్తులు రావడమే కాక స్వచ్చందంగా చాల పనిని కూడా చేస్తారు. ఈ దర్గా కు చాల దగ్గరలో మరొక కొండ ఉంది అదే కాపురాల గుట్ట కొండ.