మేళ్ళచెర్వు, నల్గొండ పట్టణానికి దగ్గరలో నల్గొండ జిల్లలో ఉన్న ఒక గ్రామం. ఆసక్తి కరంగా ఈ గ్రామం విజయవాడకు కాలువ ద్వారా కలపబడింది. ఈ గ్రామం చరిత్ర ప్రియులలో ప్రసిద్ది, కారణం కాకతీయ రాజుల కాలం నాటి అద్భుత నిర్మాణశైలిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఈ విషయం అర్ధం చేసుకోవడానికి కేవలం మేళ్ళచెర్వు లోని కొన్ని ప్రసిద్ధ ఆలయాలను చూడటమే మన చేయవలసిన పని.
ఈ ప్రాంతంలో అతి ముఖ్య దేవాలయం స్వయంభూ శంభులింగేశ్వర స్వామి ఆలయం. ఈ దేవాలయంలో ఒక ఆకర్షణీయ లక్షణం ఆలయ౦ పైన లింగం ఉండటం. లింగం పైన 2 అంగుళాలు రంధ్రం ఉంది, ఇది ఏడాది పొడవునా ఏ సమయంలోనైన నీటితో నిండి ఉంటుంది. ఈ కారణంగానే మేళ్ళచెర్వు గ్రామ౦ దక్షిణాది కాశిగా పేరొందింది. దీని ఎత్తు ఒక స్థిరమైన వేగంతో పెరగడమనేది ఈ దేవాలయానికి సంబందించిన మరొక ప్రసిద్ధ విశ్వాసం