సిక్కిం లోని సంద్రుప్త్సే చాలా ఆసక్తిని కలిగించే పర్యాటక కేంద్రం. భూటియా భాషలో సంద్రుప్త్సే అంటే ‘కోరికలు తీర్చే కొండ’ అని అర్ధం, ఈ ప్రదేశం సిక్కింలోని ప్రసిద్ధ యాత్రా స్థలం. సంద్రుప్త్సే దక్షిణ సిక్కిం ప్రాంతం లోని నామ్చి కి దగ్గరలో ఉంటుది. ఇది గాంగ్టక్ నుంచి 75 కిలోమీటర్ల దూరంలో వుంటుంది. సిక్కిం భూభాగాన్ని ఆశీర్వదించిన యోగి, గురు రింపోచే గా పిలువబడే గురు పద్మసంభవుడి పెద్ద విగ్రహం వల్ల ఈ కొండ ప్రాంతానికి చాలా ప్రాచుర్యం వచ్చింది.
ప్రపంచంలోనే 135 అడుగుల ఎత్తున్న పద్మసంభవుడి ఏకైక విగ్రహం ఇక్కడ వుంది. ఈ విగ్రహానికి శంకు స్థాపన 1997 లో దలై లామా చేయగా, అక్కడి నుంచి మూడేళ్ళలో ఈ నిర్మాణం పూర్తయింది. ఈ నిర్మాణానికి సిక్కిం ప్రభుత్వం ఆర్ధిక సహాయం అందించింది.