నంది హిల్స్ పర్యాటకులు టిప్పు సుల్తాన్ వేసవి విడిదిని, కోటను తప్పక చూడాలి. ఇది సుమారు 90 ఎకరాలలో ఉంది. సముద్ర మట్టానికి 4,851 అడుగుల ఎత్తున కలదు. కోట శ్రీరంగపట్నంలోని దరియా దౌలత్ నమూనాలో ఉంటుంది. టిప్పు సుల్తాన్ కోట నిర్మాణం చిక్కబల్లపూర్ నేతలు ప్రారంభించగా దానిని 1791లో టిప్పు సుల్తాన్ పూర్తి చేశాడు. ఇది టిప్పు సుల్తాన్ కు వేసవి విడిదిగా ఉండేది. దీనికి అతను తష్క్ ఎ జన్నత్ అంటే అసూయపడే స్వర్గం అని పేరు పెట్టాడు. ఈ నిర్మాణం లో అధికంగా కలప ఉపయోగించారు. టవర్లు, ద్వారాలు అప్పటి శిల్ప శైలితో చక్కగా చెక్కబడ్డాయి. కోట సీలింగు, గోడలు పెయింటింగ్ లతో అలంకరించబడ్డాయి. కోటలో దాని అయిదు ఆర్చిలు, మినరెట్లు ఆకర్షణ. టిప్పు భవనంలోకి సాధారణ ప్రజానీక ప్రవేశానికి అనుమతినివ్వరు.



Click it and Unblock the Notifications