పెద్ద పెద్ద నగరాల్లో, పట్టణాల్లో ట్రాఫిక్ను నియంత్రించేందుకు హైవేలు, ఫ్లైఓవర్లను నిర్మిస్తుంటారు. ఇక, హైదరాబాద్ నుంచి విజయవాడ హైవేపై ప్రయాణాలు సాగించేవారికి ప్రభుత్వం ఓ శుభవార్తను అందించనుంచి ఇక నుంచి ఎటువంటి టెన్షన్ లేకుండా సాఫీగా ప్రయాణాలు సాగించొచ్చు. ఈ జాతీయ రహదారిపై సూర్యాపేట జిల్లా టేకుమట్ల వద్ద ఫ్లైఓవర్ నిర్మాణానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఈ మేరకు మంత్రి కోమటిరెడ్డి అధికారులతో చర్చలు జరిపారు. త్వరలోనే ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ప్రారంభంచనున్నారు.

కొత్త ఫ్లైఓవర్ నిర్మాణం..
దేశంలోనే అత్యంత రద్దీగా ఉండే జాతీయ రహదారుల్లో ఇది ఒకటి. ఈ జాతీయ రహదారిపై ప్రతిరోజూ వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఈ రహదారి వారధిలా ఉంటుందని చెప్పొచ్చు. అయితే, నిత్యం రద్దీగా ఉండే ఈ జాతీయ రహదారిపై తరుచూ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి..ఈ క్రమంలో రోడ్డు ప్రమాదాల నివారణకు తెలంగాణ ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ హైవేపై కొత్తగా ఫ్లైఓవర్ నిర్మాణానికి అధికారులు సమాయత్తమవతన్నారు. ఇక, హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో ప్రయాణం చేసేవారికి కూడా చాలా వరకూ ట్రాఫిక్ కష్టాలు తీరినట్లవుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై ఇటీవల కాలంలో ట్రాఫిక్ రద్దీ భారీగా పెరిగింది. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈ మార్గంలో ఒక ఫ్లైఓవర్ నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.

టేకుమట్ల వద్ద ఫ్లైఓవర్ నిర్మాణం..
ఇందులో భాగంగానే రేవంత్ రెడ్డి సర్కార్ సూర్యాపేట సమీపంలోని టేకుమట్ల వద్ద ఫ్లైఓవర్ నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఫ్లైఓవర్ కారణంగా హైదరాబాద్ - విజయవాడ జాతీయరహదారిపై తరుచుగా జరిగే రోడ్డు ప్రమాదాలను నివారించొచ్చు. ఇక్కడ జరుగుతున్న ప్రమాదాలు, వాహనదారుల ఇబ్బందులను గమనంలో ఉంచుకొని అక్కడ ఫ్లై ఓవర్ను నిర్మించాలని ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు ఆర్ అండ్ బీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను కలిసి చర్చించారు. నిన్న (బుధవారం జులై 31) అధికారులతో చర్చల అనంతరం వారు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం..
ఈ ఫ్లైఓవర్ నిర్మాణం పూర్తయితే మాత్రం ఈ జాతీయ రహదారపై వెళ్లే వాహనదారులకు యూటర్న్ కష్టాలు తప్పనున్నాయి. ఈ ఫ్లైఓవర్పై వాహనాల పరిమితి వేగం కూడా పెరగనుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా దూసుకెళ్లిపోవచ్చు. ప్రస్తుతం ఈ జాతీయ రహదారి నాలుగు వరుసలుగా ఉంది. గతంలో కేవలం రహదారి 2 వరసలు మాత్రమే ఉండేది. 2010లో అప్పటి ప్రభుత్వం ఈ జాతీయ రహదారి కాస్త విస్తరించింది. ఇదిలా ఉండగా,జాచీ రహదారి విస్తరణ కోసం అప్పట్లోనే భూమిని సేకరించారు. కానీ విస్తరణ జరగలేదు. రోడ్డు విస్తరణపై అధికారులు చర్చించారు. త్వరలోనే ఈ ఫ్లైఓర్ విస్తరణ పనులు మెుదలు కానున్నాయి.



Click it and Unblock the Notifications













