దట్టమైన వర్షాధార అడవులకు ప్రసిద్ది చెందిన నెడుం కయం, నిలంబూర్ నుండి 18 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రకృతి సౌందర్యానికి నిలయమైన ఈ ప్రాంతంలో ఎన్నో రకాల వృక్ష జంతు జలాలు విస్తృత౦గా ఉన్నాయి.బ్రిటిష్ కాలంలో నిర్మించిన కలప వసతి గృహం నేడుమ్కయం లోని ప్రధాన ఆకర్షణలలో ఒకటి. ఈ వసతి గృహం నుండి సందర్శకులు పరిసరాలలోని పచ్చదనాన్ని, జంతుజీవనాన్ని వీక్షించవచ్చు.పచ్చదనాల సంపద నెడుం కాయం ఆటవీక్షేత్రంలో ఏనుగులు, దున్నలు, పులులు, కుందేళ్ళు, నీలి కోతులు, ఎలుగుబంటి, అడవి పిల్లి, జింకలు వంటి ఎన్నోరకాల జంతుజాతులు ఉన్నాయి. ఈ ప్రాంత పరిరక్షణకు కఠీన చర్యలు చేపట్టినందున సందర్శకులు అటవీశాఖ వారి అనుమతి తీసుకొన్న తర్వాత మాత్రమే ఈ ప్రాంతంలో ప్రవేశించాలి.నెడుం కాయంలో ఉన్న ఒక ఏనుగుల మచ్చిక శిబిరం ఈ ప్రాంతానికి ప్రతి ఏడు వేలాదిమంది సందర్శకులను ఆకర్షిస్తుంది. ఈ ప్రాంతం నీలగిరి జీవావరణ పరిరక్షణలో భాగమే కాక కేరళ ప్రభుత్వం వారి రెండవ పర్యావరణ పర్యాటక రంగ అభివృద్ది ప్రాజెక్ట్ క్రింద ఎంపిక చేయబడింది. ప్రకృతి దృశ్యాల విస్తృత మార్గాలతో కూడిన నెడుం కాయం ఒక ఉత్తమ పర్వతారోహణ ప్రాంతం



Click it and Unblock the Notifications