దోమకొండ కోట దోమకొండ గ్రామంలో కలదు. ఇది నిజామాబాద్ పట్టణానికి 38 కి. మీ. లు , హైదరాబాద్ నగరానికి సుమారు 98 కి. మీ.ల దూరంలో వుంటుంది.
ఈ కోట చారిత్రక అంశాల దృష్ట్యా తెలంగాణా మరియు నిజామాబాద్ లో ప్రసిద్ధి. ఈ కోటను కామినేని వంశ రాజులూ అంటే కమ్మ కులస్తులు సుమారు 400 సంవత్సరాల కిందట నిర్మించారు. కోట వెలుపల అందమైన శివ టెంపుల్ , కాకతీయ రాజులు కట్టించినది కలదు.
నేడు కోట చాల వరకు శిధిలమై వుంది. అయినప్పటికీ ఆ కాలం నాటి అద్భుత శిల్ప వైభవాన్ని ప్రదర్శిస్తుంది. కోట బలంగా, అందంగా వుంటుంది. ఈ కోట నిర్మాణ శైలి లో ముస్లిం మరియు హిందూ శిల్ప తీరు తెన్నులు ఉండటం విశేషం.