నిజామాబాద్ జిల్లాలోని నిజాం సాగర్ డాం మంజీరా నదిపై కలదు. గోదావరి నది ఉప నదులలో మంజీరా ఒకటి. ఈ డాం హైదరాబాద్ కు వాయువ్యంగా వుంటుంది. సుమారు 145 కి. మీ.ల దూరం లో అచ్చంపేట్ మరియు బంజపల్లె ల మధ్య నిజామాబాద్ జిల్లాలో కలదు. రెండు పట్టణాల మధ్యగా సుమారు 3 కి. మీ. ల పొడవున నిజాం సాగర్ డాం నిర్మించారు.
నిజామాబాద్ జిల్లాలో సాగునీటి అవసరాలను తీర్చేందుకు దీనిని నిర్మించారు. నేడు ఈ డాం దాని పై గల 14 అడుగుల వెడల్పు ట్రాఫిక్ రోడ్ తో ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశంగా మారింది. రోడ్ నుండి అందమైన ప్రకృతి దృశ్యాలు ఎన్నో చూడవచ్చు.