కెంటు మసీదు పట్టణ మధ్య భాగం లో కలదు. ఈ మసీదు ముస్లిములకు చాలా పవిత్రమైనది. ముస్లింలు చాలామంది ప్రతి రోజూ ఇక్కడకు వచ్చి ఉదయం, మధ్యాహ్నం , మరియు సాయంత్రాలు నమాజ్ చేస్తారు.
మసీదు పర్షియా శిల్ప శైలి కి ఉదాహరణగా వుంటుంది. అయితే, దీనిని నిజాములు కట్టించినందున కొంత మేరకు భారతీయ శిల్ప శైలి కూడా కలిగి వుంటుంది. దీని నిర్మాణం లో ఇటాలియన్ మార్బుల్ రాళ్ళని ఉపయోగించారు. ఎన్నో రకాల పర్షియా చిత్రాలు , బోధనలు గోడలపై వ్రాయబడి ఉంటాయి.