పర్భాని ని గతంలో పర్భావతినగర్ అనేవారు. పర్భాని మహారాష్ట్రలో ఒక జిల్లాగా ఉంది. మరాఠ్ వాడా ప్రాంతంలోని ఎనిమిది జిల్లాలలో ఇది ఒకటిగా ఉంది. పర్భాని సముద్ర మట్టానికి షుమారు 357 మీటర్ల ఎత్తున ఉంది. ఈ ప్రదేశానికి ఒక వైపున బాలాఘాట్ కొండలు మరో వైపు అజంతా హిల్స్ ఉంటాయి.
హిందూ పురాణాలలో పర్భానికి మతపర విశేషత కూడా కలదు. ఈ ప్రదేశం సాయిబాబా వంటి మహాత్ముల జన్మస్ధలం. సమీప ప్రాంతాలలో అనేక దేవాలయాలు కూడా ఉన్నాయి.
దేవాలయాల పవిత్ర స్ధలం పర్భాని పేరు మాత ప్రభావతి దేవత పేరుపై పెట్టారు. ఈ దేవత ఎంతో మహిమ కలది. ముస్లిం రాజకవంశీకులైన సుల్తానులు, మొగలాయీలు, నిజాముల కింద ఈ ప్రదేశం అభివృధ్ధి కాలేదు. సుమారు 650 సంవత్సరాలు పర్భాని ఒక కుగ్రామంగానే ఉంది. అయితే, దానిని మహారాష్ట్రలో 1960వ సంవత్సరంలో కలిపిన తర్వాత అభివృధ్ధి చెందుతోంది.
దత్తాత్రేయ అవతారంగా చెప్పబడే సాయిబాబా జన్మస్ధలం దీని సమీపంలోని పత్రి. షుమారు 45 కి.మీ. ల దూరంలో ఉంటుంది. జమరేశ్వర్ బేలేశ్వర్ మహదేవ్, మోటా మారుతి, ప్రాదేశ్వర దేవాలయాలు కూడా ఇక్కడ కలవు.
ఇక్కడకు 40 కి.మీ. ల దూరంలో జింతూర్ లో కల జైన్ దేవాలయం ప్రసిద్ధి గాంచింది. సమీపంలోని ముడ్గల్ గ్రామంలో ఒకే చోట శ్రీ మహావిష్ణువు, మరియు శివ భగవానుడు కలసి పూజలు అందుకుంటారు. నరసింహ దేవాలయం మరో ప్రసిద్ధి గాంచిన దేవాలయం.
పర్భాని నుండి 45 కి.మీ.ల దూరంలో సేలు అనే ప్రదేశంలో శ్రీ కేశవరాజ్ బాబా సాహెబ్ ఆలయం కలదు. ఈయన శ్రీ సాయిబాబాకు గురువు.



Click it and Unblock the Notifications