దాయింగ్ ఎరింగ్ వన్యప్రాణుల అభయారణ్యం రాష్ట్రంలో అత్యంత ప్రసిద్ధమైన ఉద్యానవనాలలో ఒకటిగా ఉంది. ఇది పర్యావరణ పర్యాటకం కోసం ఒక ఖచ్చితమైన ప్రదేశంగా ఉన్నది. ఈ అభయారణ్యం యొక్క ప్రధాన భాగం ఒండ్రు గడ్డి భూములు కలిగి మరియు మిగిలిన ప్రాంత అడవుల్లో నీటి ద్వారా కప్పబడి ఉంటుంది. ఈ అభయారణ్యం చుట్టూ సింగ్ నది( బ్రహ్మపుత్ర )ఉండి ఒక అందమైన చిత్ర కోణాన్ని అందిస్తుంది.
ఈ అభయారణ్యం సుమారు 190 sq.km విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. అంతేకాక ఇక్కడకు సైబీరియా మరియు మంగోలియా వంటి ప్రదేశాల నుండి వచ్చే వలస పక్షుల అందమైన దృశ్యంనకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఈ విధంగా పక్షులను చూడటం పర్యాటకులకు మరియు స్థానికులకు ఒక ఇష్టమైన కార్యకలాపంగా ఉంటుంది.
దాయింగ్ ఎరింగ్ వన్యప్రాణుల అభయారణ్యం అరుణాచల్ ప్రదేశ్ వెళ్ళడానికి ప్రవేశ ద్వారంగా ఉన్న పసిఘాట్ నుండి కేవలం 13km దూరంలో ఉంది.



Click it and Unblock the Notifications