సోలంకి కాలంలో ఈ పటాన్ జైన మతానికి ప్రధాన కేంద్రంగా విరాజిల్లిందని భావన. ఇక్కడ వందల కొలది జైన్ ఆలయాలు ఉన్నాయి. పంచసార పార్శ్వనాథ్ జైన్ దేరసర్ ఆలయము ఇక్కడ ప్రధాన ఆలయాల్లో ఒకటి. సంప్రదాయం ప్రకారం ఇక్కడ ఈ జైన్ అలయాల్ని తెల్ల పాలరాతి తో నిర్మితమై ఉన్నాయి. గతంలో జైన్ ఆలయాల్ని కలపతో నిర్మించేవారు.
అయితే ఈ ఆలయాలు కలప నుండి పాలరాతి కి మారటానికి ఒక ఆసక్తి కరమైన కధ ఉన్నది. ఉడా మెహతా అనే ప్రముఖ నిర్మాణకర్త,ఒకసారి ఒక ఎలుక వెలిగే కొవ్వొత్తిని నోటితో పట్టుకొని ఆలయంలోకి పరెగెత్తుకొని వెళ్ళటం చూసాడు. అప్పుడు ఈ అంశాన్ని ప్రాదిప్రదిక గా చేసుకొని జైన్ ఆలయాలను కలపతో కాకుండా పాలరాయితో నిర్మించటం ప్రారంభించారని నమ్మిక.