రాణి కి వావ్ అనే మెట్ల బావిని సోలంకి రాజవంశ స్థాపకుడు అయిన కింగ్ భీం దేవ్ జ్ఞాపకార్థం 1063 లో ఆయన భార్య రాణి (మహారాణి) ఉదయమతి నిర్మించారు.ఈ మెట్ల బావి నిర్మాణానికి సరస్వతి నది యొక్క నీటి మట్టిని ఉపయోగించారు. స్తంభాలు సోలంకి రాజవంశం యొక్క వారి నిర్మాణ శైలి ని గుర్తుకు తెస్తుంది. రాణి కి వావ్ గోడలు మరియు స్తంభాల మీద విష్ణు రూపాలైన రామ, వామన,మహిషాసురమర్దిని, కల్కి మొదలైన అవతారాలు చెక్కబడి ఉన్నాయి.