వంకనేర్ అనే పేరు ఈ ప్రదేశం ఒక వంపు లో వుండటం వలన వచ్చింది. మంచు నది నీరు ఇక్కడ ఒక వంపు లో ప్రవహిస్తుంది. వంకనేర్ ఒక రాచరిక రాష్ట్రం దీనిని ఝాలా రాజపుత్రులు పాలించారు. కనుక దీనిని ఝాలావర్ అని కూడా అంటారు. వంకనేర్ ప్రదేశం మహారాణా అమరసింహ జి కాలంలో బాగా అభివృద్ధి చెందినది. అమర సిన్హాజి కళలు , శిల్పాలు అంటే అంటే ఎంతో ప్రేమించేవాడు. ప్రస్తుతం రాచ కుటుంబం నివసించే రంజిత్ విలాస్ పాలస్ అమర్ సిన్హాజి చే నిర్మించబడింది.
ఈ పాలస్ నిర్మాణంలో అనేక శిల్ప శైలులు అవలంబించారు. గోతిక్ ఆర్చీలు, స్తంభాలు, నవీన మార్బుల్ బల్కనీలు, మొఘల్ డోమ్ కల క్లాక్ టవర్ , ఫ్రాంకో ఇటాలియన్ కిటికీ అద్దాలు ఉదాహరణగా చెప్పవచ్చు. ప్రపంచ నలుమూలల నుండి శిల్ప శైలి తెచ్చారు.
ఈ ప్రదేశంలో సేకరించ బడిన వివిధ ఆటో మొబైల్స్ కూడా కలవు. మహారాజు కు రాయల్ ఒయాసిస్ వేసవి విడిదిగా వుండేది. రాయల్ ఒయాసిస్ మచ్చు లేక్ సమీపంలో కలదు. దీనిలో ఆర్ట్ డెకో స్టైల్ లో ఒక ఇందూర్ పూల్ కలదు. రాయల్ ఒయాసిస్ మరియు రాయల్ రెసిడెన్స్ రెండూ కూడా ఇపుడు హెరిటేజ్ హోటళ్ళు గా మారి గుజరాత్ ప్రభుత్వం చే నిర్వహించ బడుతున్నాయి. వంకనేర్ యొక్క ఈ శిల్ప శైలులు ఆ నాటి రాజ దర్పానికి ప్రతీకలు.