భారతదేశ స్వతంత్రం రావటానికి ముందు కథియవార్ ఎనిమిది రాచరిక రాష్ట్రాలలో ఒకటిగా గొండాల్ ఉన్నది. గొండాల్ లో అప్పటి పాలకులు గుజరాత్ లో ఉత్తమ ప్రణాళికాబద్ధమైన రహదారి వ్యవస్థ ఏర్పాటు చేయటం వల్ల ఈ ప్రాంతం లో కార్ల ఆకర్షణ వచ్చింది. తకోరే శ్రీ కుమ్భోజి l,మెరమంజి క్రి.శ.1643లో స్థాపించారు. తరువాత స్వాతంత్ర్యం సాధించేవరకు గొండాల్ ను పాలించిన సర్ భగవత్ సిన్ఘ్జి సమయంలో బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. తన కుమారుడు యువరాజ్ భోజ్రాజి కోసం మహారాజు భగవత్ సిన్హ్ జి రివర్సైడ్ ప్యాలెస్ ను నిర్మించారు. రివర్సైడ్ ప్యాలెస్ ప్రస్తుతం వారసత్వ హోటల్ గా ఉంది. ఈ హోటల్ లో పురాతన కొలోనియల్ శైలిలో ఉన్న విలువైన ఫర్నిచర్,పలువలు కల దీపపు స్తంభాలు మొదలైన ఇతర అలంకారాలు చూడముచ్చటగా ఉంటాయి.
రాయల్ కుటుంబం ఎల్లప్పుడూ వింటేజ్ కార్లను పట్ల ఇష్టం ఎక్కువగా ఉండేది మరియు వారి సేకరణ నేడు ఒక పర్యాటక ఆకర్షణగా మారింది. పదిహేడవ శతాబ్దం లో నిర్మించిన నవలోఖా బస్ట్ ప్యాలెస్ కోసం తొమ్మిది లక్షల రూపాయల ఖర్చు అయినది. ఈ ప్యాలెస్ నిర్మాణము ఒక అద్భుతమైన రాతి శిల్పాలలో, బాల్కనీలు, చెక్కిన తోరణాలు మరియు సర్పిల మెట్లతో ఉంది. రాజ కుటుంబం యొక్క ప్రస్తుత నివాసం, హుజూర్ ప్యాలెస్ పురాతన గృహోపకరణాలు , చిత్రలేఖనాలు, పండ్ల తోటలతో నిండి ఉంది. గొండాల్ లోస్వామినారాయణ్ సంప్రదాయ అక్షర్ మందిర్, గునతితనంద్ స్వామి 'సమాధి స్థల్ ' (విశ్రాంతి ప్రదేశం) లు ఉన్నాయి.