పోర్ బందర్ గుజరాత్ యొక్క ఒక పురాతన ఓడ రేవు పట్టణం. కతిఅబార్ తీరం లో కలదు. ఈ ప్రదేశాన్ని సాధారణంగా అందరూ గాంధీ జన్మించిన ప్రదేశంగా భావిస్తారు.
చరిత్ర
పోర్ బందర్ ను ‘సుధామ పురి ’ అని కూడా పిలుస్తారు. ఈ ప్రదేశం శ్రీ కృష్ణుడి మంచి మిత్రుడు అయిన సుధాముడు జన్మించిన స్థలంగా పురాణాలు చెపుతాయి. ఇక్కడ జరిపిన తవ్వకాలు హరప్పా నాగరికతను వెల్లడించాయి. ఇది సుమారుగా ద్వారక కాలం నాటిదే. 16 వ శతాబ్దం లో పోర్ బందర్ ను జేత్ వా రాజపుత్ర వంశం పాలించింది. మొఘల్ గవర్నర్ అధీనం లో ఈ పట్టణం వుండేది. తర్వాతి కాలంలో ఇది గాయక్వాదులు, పీశ్వాల పాలనలలో వుంది. చివరకు బ్రిటిష్ పాలన కిందకు వచ్చింది. మొగలులు, పీశ్వాలు, బ్రిటిష్ వారి కింద పోర్ బందర్ ఒక ప్రధాన వాణిజ్య ఓడ రేవుగా ఓడలు ఈస్ట్ ఆఫ్రికా, అరబ్, పెర్షియన్ గల్ఫ్ దేశాలకు ప్రయాణాలు చేసేవి. స్వాతంత్రం వచ్చిన తర్వాత కథియవార్ ఐక్య రాష్ట్రం ఒప్పందాల మేరకు పోర్ బందర్ గుజరాత్ రాష్ట్రం లో విలీనం అయింది.
భౌగోళికతలు
పోర్ బందర్ కథియవార్ లో ఒక భాగం. గుజరాత్ కు పడమటి తీరంలో అరేబియన్ సముద్రం పక్కన కలదు. ఈ ప్రదేశం ఒక మైదానం. అందమైన బీచ్ ప్రదేశాలు కొద్ది పాటి బరదా హిల్స్ వంటి కొండ ప్రదేశాలు కలవు. ఒక వైపు అరేబియా సముద్రం మిగిలిన మూడు వైపులా భాన్ వాడ, ఉప్లేతా మరియు కేశోడ్ నగరాలు కలవు.
వాతావరణం
అరేబియా సముద్రం పక్కనే వుండటం చేత వేసవి ఒక మోస్తరు గాను, వింటర్ లు ఆహ్లాదం గాను వుంటాయి. వర్షాకాలంలో వర్షాలు అధికం, పిడుగు పాటులు కూడా వుంటాయి. మొత్తంగా చేప్పాలంటే, సముద్రం పక్కనే కనుక తేమ అధికం.
చేరటం ఎలా ?
పోర్బందర్ కు రోడ్, రైల్, మరియు విమాన సదుపాయాలూ దేశం లోని అన్ని ప్రధాన నగరాలనుండి కలవు. పోర్ బందర్ రైలు స్టేషన్, పోర్ బందర్ ఎయిర్ పోర్ట్ రెండూ కూడా స్థానికం, మరియు అంతర్జాతీయంగా సేవలు అందిస్తాయి. నగరంలో తిరిగేందుకు ప్రభుత్వ బస్సులు , ఆటో రిక్షాలు కలవు.