ప్రహ్లాదన రాజు చేత స్థాపించబడి, పార్మర్ రాజ్యంలో భాగమైన పాలంపూర్ ప్రస్తుతం బనస్కాంతా జిల్లాకు ప్రధాన కేంద్ర౦. బ్రిటిష్ కాలంలో లోహనీ ఆఫ్ఘన్లు పాలించిన గుజరాత్ లోని రాజ్యం ఇది. ఇప్పటి గుజరాత్ – రాజస్థాన్ సరిహద్దుల్లోని కొన్ని రాజ్యాలు అప్పట్లో ఈ రాజ్యంలో భాగంగా ఉండేవి. ఈ ప్రాంతానికి ఒక వైపు అరావళి పర్వతాలు, ఇంకో వైపు సబర్మతీ నది వున్నాయి.
ఈ నగరంలో ఏడు ద్వారాలున్న కోట ఉండేది, అది ఇప్పుడు దాదాపు శిదిలావస్థలో వుంది. షిమ్లా ద్వారం, ఢిల్లీ ద్వారం, మీరా ద్వారం, గతమన్ ద్వారం ఈ ఏడింటిలో కొన్ని. కీర్తి స్థంభం, జోరావార్ రాజప్రాసాదం, బలరాం ప్రాసాదం వంటివి పాలన్పూర్ గత వైభవ చిహ్నాలు. హిందువులకు, జైన్లకు సంబంధించిన కొన్ని దేవాలయాలు కూడా ఇక్కడ వున్నాయి.
ప్రహ్లాదన్ మహారాజు నిర్మించిన పల్లవీయ పార్శ్వనాథ దేవాలయం లేదా మోటూ దేరాసర్, నాను దేరాసర్ పాలన్పూర్ లోని ప్రధాన జైన దేవాలయాలు. కీర్తి స్థంభం దగ్గరలోని పాతాలేశ్వర్ దేవాలయం, మోటా రాంజీ మందిరం హిందూ దేవాలయాలు. అంబాజీ మందిరం, కేదార్నాథ్ మహాదేవ మందిరం, బలరం మహాదేవ మందిరం పాలన్పూర్ నుంచి దగ్గరలో వున్న మరి కొన్ని ప్రముఖ దేవాలయాలు.