స్ధానికంగా ఈ జైన మందిరాన్ని జైన నారాయణ అని కూడా పిలుస్తారు. దీనిని 9వ శతాబ్దంలో మన్య ఖేతకు చెందిన రాష్ట్ర కూటులు నిర్మాణం చేశారు. వీరు తమ నిర్మాణాలలో ద్రవిడ శైలి కళా చెక్కడాలను చేశారు. ఈ జైన దేవాలయం ఎంతో పటిష్టమైనదిగా అతి పెద్ద బలమైన రాళ్ళతో కట్టబడింది. పర్యాటకులు ఈ ప్రాంత సందర్శనలో దీనిని తప్పక చూడాలి.
ఒక స్ధానిక విశ్వసనీయ కధనం మేరకు. ఈ జైన దేవాలయం రాజు అమోఘ వర్ష లేదా అతని కుమారుడు రెండవ క్రిష్ణచే మంజూరు చేయబడిందని విశ్వసిస్తారు. ఈ నిర్మాణానికి మూడు అంతస్తులుంటాయి. క్రింది రెండు అంతస్తులు ఇప్పటికి ఉపయోగిస్తున్నారు.
ఈ దేవాలయాన్ని సందర్శించే భక్తులు అంతరాలయాలను, ముఖ మండపాలను, ఒక పెద్ద హాలు మరియు నలుచదరపు ప్రాంగణాన్ని, ప్రదక్షిణల మార్గాన్ని కూడా చూడవచ్చు. బాల్కనీ సీటు వెలుపలి భాగాలు నాట్యకారులు, నిధిలు, వ్యాలస, పూర్ణ ఘట మొదలైన బొమ్మలతో చెక్కబడి ఉంటాయి. మావట్లు అధిరోహించిన పెద్ద ఏనుగుల చిత్రాలను కూడా హాలు గోడలపై చూడవచ్చు. హాలు ప్రవేశ భాగం పూర్ణ ఘటాలతోను, ఆరు వరుసల సంకనిధి మరియు పద్మ నిధితోను అలంకరించబడి ఉంటుంది.
ఇవి మాత్రమే కాక, భక్తులు ఆలయ లోపలి భాగంలోను మరియు హాలులోను పెద్ద పెద్ద స్తంభాలను కూడా చూడవచ్చు.



Click it and Unblock the Notifications