జంబులింగేశ్వర దేవాలయాన్ని క్రీ.శ. 7వ శతాబ్దంలో నిర్మించారు. ఇది ఒక ప్రసిద్ది గాంచిన పుణ్యక్షేత్రం. ఈ దేవాలయంలోకి ప్రవేశించగానే భక్తులు మాత పార్వతిని, శివ భగవానుడిని, నందిని దర్శిస్తారు. కడసిద్ధేశ్వర దేవాలయంలో వలెనే, ఇది కూడా అయిదు మిద్దెలతో నిర్మించబడింది.
పై భాగ మిద్దెపై చిన్న దేవతల బొమ్మలు, పక్షులు, మొదలైనవి చెక్కారు. భక్తులు పురాణ ఇతి హాస గాధలను కూడా ఈ దేవాలయ గోడల దిగువ భాగంలో చూడవచ్చు. నంది మండప దిగువ భాగం మరియు నంది విగ్రహ అవశేషాలు దేవాలయంలోని తూర్పు భాగంలో కనపడతాయి. ఈ ప్రాంగణ గోడలు విష్ణు మూర్తి, సూర్యుడు, శివుడు బొమ్మలతో చెక్కబడ్డాయి.
గర్భగృహ సీలింగ్ పలకలు, మండప సీలింగ్ లు వివిధ రకాల బొమ్మలతో చెక్కబడి ఉన్నాయి. మండప ప్రవేశ ద్వారం కూడా ఆకర్షణీయ చిత్రాలు కలిగి ఉంటుంది. పట్టడకాల్ దర్శిచే పర్యాటకులు జంబులింగేశ్వర దేవాలయాన్ని తప్పక చూడాలి.



Click it and Unblock the Notifications