పోఖరాన్ కోటను బాలా ఘర్ అని పిలుస్తారు. ఇది సుమారు 14వ శతాబ్దానికి చెందిన పురాతన కోట. ఈ కోట ధార్ ఎడారి మధ్య భాగంలో కలదు. చారిత్రాత్మకంగా ఇది సుగంధ ద్రవ్యాలు, ఉప్పు మరియు సిల్క్ ఉత్పత్తుల రవాణా మార్గంలో కలదు. ఈ వస్తువులను గతంలో పర్షియా మరియు ఇతర దేశాలకు ఎగుమతులు చేసేవారు. రాధోర్ తెగకు చెందిన చంపావత్ ల నాయకుడికి చెందిన ఈ కోట ప్రధానమైనది. గతంలోని ఖ్యాతి కోట చరిత్ర వంటివి పర్యాటకులను భారతదేశం మరియు విదేశాలనుండి కూడా ఆకర్షిస్తాయి. పర్యాటకులు ఇక్కడ అందమైన ఎరుపు రంగు శాండ్ స్టోన్ రాజ ప్రాసాదాలు, సాంప్రదాయక ఝరోఖాలు, ఎత్తైన టవర్లు చూడవచ్చు. ప్రస్తుతం, ఠాకూర్ నాగేంద్ర సింగ్ పోఖరాన్ మరియు అతని భార్య ఠాకూర్ రాణి యశ్వంత్ కుమారి పోఖరాన్ తమ కోట గేట్లను పర్యాటకులకు తెరచి ఆహ్వానిస్తున్నారు. ఈ కోట మొగలులు మరియు రాజపుత్ర శైలి శిల్ప సంపదకు ఒక అందమైన ఉదాహరణగా నిలుస్తుంది. రాచరికపు ఆయుధాలు, దుస్తులు, పెయింటింగ్ లు మరియు చేతి కళల వస్తువులు కలిగిన మ్యూజియం కూడా కలదు. ఒక గొప్ప లైబ్రీ కూడా కలదు. దీనిలో రావ్ బహదూర్ రాజశ్రీ ఠాకూర్ ఛైన్ సింగ్ జి పోకరాన్ కు సంబంధించి సేకరించిన అనేక ఇతిహాస గ్రంధాలు కూడా కలవు.



Click it and Unblock the Notifications