ఈ టెంపుల్ గురించి పురాణాలలో కలదు. నాగ వాసుకి విగ్రహం గుడి మధ్యలో వుంటుంది. దీనిని 10 వ శతాబ్దం లో నిర్మించారని చెపుతారు. అయితే ప్రస్తుత టెంపుల్ మాత్రం 18 వ శతాబ్దం తరవాతది గానే కనపడుతోంది.
ఈ టెంపుల్ కు సంవత్సరం పొడవునా భక్తులు వస్తారు. నాగ పంచమి నాడు ఉత్సవాలు చేసేటపుడు మరింత అధిక సంఖ్య లో భక్తులు వస్తారు.