సాయి నది ఉత్తర ప్రదేశ్ లోని ప్రతాప్ఘర్ తో సహా అన్ని జిల్లాలలోను ప్రవహిస్తుంది. ఈ నది హిందువులకు పవిత్రం. ఈ నది గురించి పురాణాలలోను, రామచరిత మానస్ లోను పేర్కొనబడింది. ఇది ఆదిగంగ గా పేర్కొనబడింది. సాయి నది గోమతి నదికి ఉపశాఖగా హర్దొఇ జిల్లాలో పుడుతుంది. లక్నో, ఉన్నావో ల గుండా ప్రవహిస్తుంది. చండిక ధాం ను తగులుతూ అనేక రీతులలో ప్రవహించి చివరకు పడమర దిశ నుండి ప్రతాప్ ఘర్ లోకి ప్రవేశిస్తుంది. ఈ నదిలో స్నానం చేసి భక్తులు ధాం లోను మరియు టెంపుల్ లోను పూజలు చేస్తారు.