రామేశ్వరం లో కల కోదండరామ టెంపుల్ కు మత మరియు చారిత్రక ప్రాధాన్యత కలదు. ఈ ప్రదేశంలో శ్రీ రాముడు, రావణుడి ని వధించిన తర్వాత విభీషణుడికి రాజ్యాభిషేకం చేసినట్లు చెపుతారు. వాస్తవానికి ఈ టెంపుల్ గోడపై కల ఒక చిత్రం దీనికి సాక్ష్యంగా వుంటుంది.
సేతు సముద్రం షిప్ కెనాల్ నిర్మాణ ప్రతిపాదన జరిగినపుడు ఈ టెంపుల్ ను తొలగించాలని భావించారు. అయితే ఆ ప్రతిపాదనలు మరుగున పడటంతో ఒక మంచి టెంపుల్ మరియు ఆ టెంపుల్ పై ఆధార పడిన అనేక మంది జీవనానికి మరో మారు ఆధారం లభించినట్లు అయింది.
ఆసక్తి కరంగా ఈ కోదండరామ టెంపుల్ ను కలకత్తా కు చెందిన ఒక బెంగాలి ధార్మికుడు రామకుమార్ బంగూర్ పురాతన భాగాలను కొన్నింటిని 1976 మరియు 1978 ల మధ్య పునరుద్ధరించాడు. నేడు ఈ టెంపుల్ శ్రీ రామనాథస్వామి టెంపుల్ అధీనంలో కల సుమారు అటువంటి 31 దేవాలయాలలో ఒకటిగా వుంది.